Monday, May 20, 2024
- Advertisement -

లోకేష్ ని ” తమ్ముడూ కాస్త తగ్గు” అన్న కేటీఆర్

- Advertisement -

” హైదరాబాద్ కి అది చేసాం ఇది చేసాం అంటూ కహానీలు చెప్పడం ఆపండి, నరేంద్ర మోడీ కానీ మీరు కానీ గుక్కెడు నీళ్ళు కూడా తేలేక పోయారు అమరావతి కి. హైదరాబాద్ సంగతి మేము చూసుకుంటాం తమ్ముడూ నువ్వు అమరావతి సంగతి చూసుకో ” అంటున్నారు కేటీఆర్ . గ్రేటర్ ఎన్నికల నేపధ్యం లో ప్రచారం మంచి ఘాటు ఘాటుగా సాగుతోంది అని ఉదాహరణ ఈ రకంగా చూడచ్చు మనం.

నారా లోకేష్ మరొక పక్క తెలంగాణా కి యాభై వేల ఇళ్ళు ఇచ్చారు, దానికి కారణం టీడీపీ నే అంటూ చెప్పారు . గడిచిన పద్దెనిమిది నెలల లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది తామే అని కేటీఆర్ చెబుతుంటే అధికారం లో ఉన్న రోజుల్లో తాము ఇంకా ఎక్కువ చేసాం అని లోకేష్ చెప్పుకొచ్చారు.

 ఏదేమైనా ఒక పక్క కేటీఆర్ మరొక పక్క లోకేష్ ఈ గ్రేటర్ ఎన్నికలని టీడీపీ – తెరాస ల మధ్య కాకుండా తామిద్దరి మధ్యనా సై అంటే సై అన్నట్టు మార్చేసారు. గ్రేటర్ అభివృద్ధి అధికారం లో ఉన్న తమవల్లనే అవుతుంది అనే లాజిక్ కేటీఆర్ చెబుతుంటే కేంద్రం నుంచి నిధులు రప్పించ గలిగింది తాము మాత్రమే అనే పంథా లో లోకేష్ వెళుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -