Wednesday, May 15, 2024
- Advertisement -

షాకింగ్: మంత్రిని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ చేశారు

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌ని తీరు న‌వ్వులు పుట్టించింది. ఏకంగా రాష్ట్ర పురపాలక శాఖకు మంత్రిగా ఉన్న నారాయణను మునిసిపల్‌ కమిషనర్ చేసేశారు. ఈ నిర్వాకం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మీపంలో మంగ‌ళ‌గిరిలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌గిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.

ఈ ఫ్లెక్సీలపై మునిసిపల్ శాఖ అధికారులు, మంత్రుల ఫొటోలు ప్ర‌చురిస్తున్నారు. అయితే స్వ‌యాన ఆ శాఖ మంత్రి నారాయణ ఫొటోకు తీవ్ర త‌ప్పిదం చేశారు. మంగళగిరి పురపాలక సంఘ కమిషనర్‌గా పేర్కొంటూ మంత్రి నారాయ‌ణ బొమ్మ వేశారు. అలాగే ఆ ఫ్లెక్సీని ఏర్పాటుచేయ‌డంతో అటువైపు వెళ్లేవారు శాఖ‌కు గుర‌య్యారు. నారాయ‌ణ ఎప్పుడూ ఉన్న‌తాధికారి అయ్యాడు అని ముక్కున వేలేసుకున్నారు. ఈ ఫ్లెక్సీలు ఒక్క‌చోట కాదు చాలాచోట్ల ఉంచ‌డంతో ఒక్క‌సారిగా హాట్‌టాపిక‌య్యింది.

వాళ్లు వీళ్లు గ‌మ‌నించిన అనంత‌రం పొరపాటును గ్ర‌హించిన పాలకులు, అధికారులు వెంట‌నే స్పందించారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఫ్లెక్సీలపై రాసిన కమిషనర్‌, మంగళగిరి పురపాలక సంఘం అనే రాతలపై స్టిక్కర్లు అంటించి తమ తప్పును కప్పిపుచ్చుకునే యత్నం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -