Monday, April 29, 2024
- Advertisement -

ఎమ్మెల్యే చెల్లెల్ని రేప్ చేసి చంపేశారు!

- Advertisement -

బీహార్‌లో మ‌హిళ‌లపై దాడులు ఆగ‌డం లేదు. ఢిల్లీ, యూపీలు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగీక దాడులు, అత్యాచారాల విష‌యంలో ముందుంటే బీహార్ మాత్రం ద‌ళితుల‌పై దాడుల్లో టాప్ ప్లేసులో ఉంది. అయితే తాజగా బీహార్‌లో ఓ ద‌ళిత ఎమ్మెల్యే చెల్లినే దండుగులు రేప్ చేసి చంపేశారు. ఈ ఘటన ఇప్పుడు బీహార్ లో కలకలం రేపుతుంది.

ఆ దుండగులపై అందరు మండిపడుతున్నారు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే చెల్లికే ర‌క్ష‌ణ లేక‌పోతే ఇక సామాన్య మ‌హిళ‌ల ప‌రిస్థితి ఏంట‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భోజ్‌పూర్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే సరోజ్‌ జాదవ్‌ సోదరిని దుండగులు దారుణంగా చంపేశారు. ఆస్పత్రి నుంచి ఆటోలో బయలుదేరిన ఆమెపై దుండగులు దాడి చేశారు. ఆటోలోనే ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు.

ఆమె ఎదురుతిరగడంతో చంపి, శవాన్ని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి సోదరుడు ఎమ్మెల్యే సరోజ్‌ జాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ తమ చెల్లెలు ఆస్పత్రి నుంచి ఇంటికి రావడానికి ఆటోలో బయలుదేరిందని చెప్పారు. ఆటో వేరే దారిలో వెళ్తుండడంతో ఆమె అరచి గోల చేసిందని, అదే ఆటోలో ఉన్న దుండగులు ఆమెపై దాడి చేసి, అత్యాచారయత్నానికి పాల్పడ్డారని, ఆమె ఎదురుతిరగడంతో చంపేసి, శవాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారని ఆయన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -