Sunday, May 19, 2024
- Advertisement -

ఆ ఎమ్మెల్యే భార్యను హింసించే ఒక సైకో..!

- Advertisement -

ఏడో నెల గర్భంతో ఉన్న ఆమెను అబార్షన్ చేయించుకోమన్నాడట.. అందుకు ఒప్పుకోని ఆమెను తీవ్రమైన హింసకు గురి చేశాడు. ఏకంగా ఆమెపైకి కుక్కలను వదిలేంత క్రూరత్వం ఉందట అతడిలో. అతడు పెట్టే హింసను భరించలేక తన మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించానని కూడా ఆమె చెబుతోంది. ఈ మేరకు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఆ ఎమ్మెల్యే గారి భార్య.

 

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటే.. జనసామాన్యంలో కూడా గౌరవం ఉంది. ప్రత్యేకించి చదువుకొన్న వారు అంతా ఆప్ కు అండగా నిలుస్తున్నారు. ఆప్ నేతలను గౌరవిస్తున్నారు. అయితే అలాంటి వారిలోని కొందరిపై ఇప్పుడు వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి పై ఇప్పుడు ఆయన భార్య చేసిన ఫిర్యాదు  సంచలనంగా మారింది.

తన భర్త తనను తీవ్రంగా హింస పెట్టాడని ఆమె అంటోంది. మోసం చేసి తనను పెళ్లి చేసుకొన్నాడని.. షాదీ వెబ్ సైట్ లో అబద్దాలు చెప్పాడని.. తీరా పెళ్లి చేసుకొన్న తర్వాత తనను అనేక రకాలగా హింసించాడని.. చివరకు మీదకు కుక్కలను వదిలిని ఆనందించేంత సైకో అతడు అని ఆమె పేర్కొంది. ఈ మేరకు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరి ఆమె ఆరోపణలను బట్టి చూస్తుంటే ఆ ఎమ్మెల్యే పెద్ద సైకో అని అనుకోవాలి. అతడిపై ఆప్ అధినేత కేజ్రీవాల్ చర్యలు తీసుకొంటాడా? లేక చట్టం చర్యలు తీసుకొంటుందా?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -