- Advertisement -
వైఎస్ఆర్ సిపి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. గత కొంతకాలంగా ఆయన టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా ఒకటి రెండుసార్లు బహిరంగంగానే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
చివరికి బుధవారం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సుజన తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఆయనతో పాటు బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు కూడా టిడిపిలో చేరారు.