మంచు మోహన్ బాబు పరిస్థితి ఎలా ఉంది అంటే, మొదటి నుండి తెలుగు దేశానికి సపోర్ట్ గా ఉంటూ గత కొంత కలం గా చంద్ర బాబు నాయుడు తో చెడి, ఆయన బహిరంగం గా వెళ్ళి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి జగన్ కి మద్దతు గా నిలిచి కొన్ని కీలక నియోజకవర్గాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేసి, కొంత మంది గెలుపులో భాగం పంచుకొని ఇప్పుడు మళ్ళీ అటెన్షన్ లేకుండా అయిపోయిందే అనే బాధ తో ఉన్నారు.
సాధారణం గా మోహన్ బాబు అటెన్షన్ ని ఇష్టపడతారు. అయితే అతని సన్నిహత వర్గీయులు కొంత మంది ఆయనకి వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏదైనా పదవి ఇస్తారు అని చెప్పుకుంటూ వచ్చినా ఆయన మాత్రం ఏ నాడు ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ మోహన్ బాబు నిజానికి పదవులు ఆశిస్తున్నారు అంటారు కొంతమంది.
విడ్డూరం గా అసలు మీడియా లో ఎక్కువ ప్రచారo లేకపోయినా తనకి పలానా పదవి ఇస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి, అందులో నిజం లేదు అని మోహన్ బాబు వెంటనే ప్రెస్ నాట్ పంపుతారు. అలంటిది ఒకటి ఇప్పుడు మళ్ళీ జరిగింది.
“ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్.డి.సి) చైర్మన్గా నటుడు, నిర్మాత, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత డా.మంచు మోహన్బాబుగారిని నియమించారని సోషల్ మీడియాలో కొన్నిచోట్ల వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదు.” అని మోహన్బాబు పి.ఆర్ టీమ్ తెలిపింది.