- Advertisement -
వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. బుధవారం నాడు నైరుతి రుతుపనాలు కేరళలో ప్రవేశించినట్లుగ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలకు దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించి కేరళలో ప్రవేశించాయి. దీని ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో ఐదారు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.