Wednesday, April 24, 2024
- Advertisement -

ధోనీ ని అరస్ట్ చేస్తారా ?

- Advertisement -

ఈ మధ్యకాలంలో అభిమానులు తమ అభిమాన హీరోలనో, క్రికెటర్లనో, రాజకీయ నాయకులనో.. దేవుళ్లుగా, దేవతలుగా చిత్రించడం చూస్తున్నాం. మోడీ ఫోటొలు, జయలలిత ఫోటోలు దేవుళ్లుగా చిత్రీకరించి ఇప్పటికే చాలా మంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే క్రమంలో ధోనీని విష్ణుమూర్తిగా చిత్రించిన సంఘటన కూడా జరిగింది.

ప్రస్తుతం ఈ చిత్రమే ధోనీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేలా చేసింది.వివరాల్లోకి వెళితే.. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ఒక మేగజైన్ కవర్ పేజిపై ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక కేసులు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి బెంగళూరు కోర్టులో విచారణ సాగుతుంది.

ఇదే క్రమంలో తాజాగా అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ప్రకటన మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వి.హెచ్.పి. నేత శ్యాం సుందర్ ఈ మేరకు అనంతపురం కోర్టులో కేసు దాఖలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -