Monday, May 20, 2024
- Advertisement -

ఎందుకు అంత కోపం లోకేష్ బాబూ ?

- Advertisement -

ఎన్నికల సమయంలో సెలబ్రిటీ ఓటర్ల ఫోటోలు తీయడం కోసం పత్రికా ప్రతినిధులు పోటీ పడుతూ ఉంటారు, ఓటర్ల సంఖ్య పెంచడం కోసం వారి నుంచి వాయిస్ ని కూడా తీసుకుని తద్వారా ప్రజలలో ఒక సెలెబ్రిటీ ఓటు వేసాడు మీరు కూడా వచ్చి ఓటు వెయ్యండి అనే సందేశం పంపించడం కోసం చూస్తూ ఉంటారు. ఇది చాల సహజమైన విషయం. దానికి సేలేబ్రిటీలు కూడా ఓకే చెబుతూ పోజులు ఇచ్చి వేలు చూపించి ఓటు వెయ్యమని కోరతారు.

గ్రేటర్ పోలింగ్ నేపధ్యం లో జూబ్లీ హిల్స్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. నారా లోకేష్ బాబు తన తల్లి భువనేశ్వరీ , తన భార్య బ్రాహ్మణి ఇద్దరితో కలిసి ఓటు హక్కు వినియోగం కోసం పోలింగ్ బూత్ కి రాగా టీడీపీ యువ నేత కావడం తో లోకేష్ చుట్టూ మూగింది మీడియా. తనను చుట్టు ముట్టిన మీడియాపై ఆసహనం వ్యక్తం చేశారు. మీరేంటి.. మీతోనే తలనొప్పి అని లోకేష్ వ్యాఖ్యనించారు! 

గ్రేటర్ ఓటర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటీ సార్? అని మీడియా విజ్ఞప్తి చేయగా.. లోకేష్ మాత్రం ఏం మాట్లాడతాం.. ఇక్కడ మాట్లాడకూడదని అని సమాధానం ఇచ్చారు.  “అవసరం లేదు” అనకుంటూ మీడియా పై గుర్రుమన్నారు. “ఇంతకు ముందు మాట్లాడితే ఇలాగే”.. అంటూ గొణుక్కుంటు వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు, ఓటర్లు ముక్కుమీద వేలు వేసుకున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -