- Advertisement -
తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ కు ఎంత ప్రజాధరణ ఉందో.. తమిళనాట కూడా ఎంజీఆర్ కు కూడా అంతే ఆదరణ ఉంది. సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ పార్టీలను స్థాపించి ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు.అనంతర కాలంలో ఇద్దరూ పరమపదించారు. తరువాత వారి వారసులు పాలన సాగిస్తున్నారు.
కాగా.. ఇటీవల కాలంలో తమిళనాట ఎంజీఆర్ వారసురాలిగా బాధ్యలు చేపట్టిన జయలలిత అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ వారసులు మాత్రం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజిగంను కాస్త.. ల్ ఇండియా అమ్మా ద్రవిడ మున్నెట్ర కజిగం పేరుతో మారో పార్టీని స్థాపించారు. పార్టీ జెండా కూడా ఏఐడీఎంకే జెండాను పోలి ఉంటుందట. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళుతున్నారట.