Saturday, May 18, 2024
- Advertisement -

కష్టాలో ఉన్నాం.. సమస్యలొద్దు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉందని, ఇలాంటి సమయంలో సమస్యలు తీసుకురావద్దని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హితవు పలికారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణదీక్షపై చంద్రబాబు విజయవాడలో స్పందించారు.

రాష్ట్రంలో తనకు శాంతిభద్రతలు ముఖ్యమని, దానికి విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు తీసుకువస్తే ఎవరు దాన్ని సరిదిద్దుతారని ఆయన ప్రశ్నించారు. తునిలో రైళ్లను తగలుబెట్టిన వారు రౌడీలు కాదా.. రౌడీలను అరెస్టు చేస్తే తప్పా అని ఆయన నిలదీసారు. కాపులకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాపు కమిషన్ తో పాటు రిజర్వేషన్లపై కూడా తమకు స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -