- Advertisement -
దేవాలయాలకు వస్తున్న ఆదాయం.. ప్రజల్లో పెరుగుతున్న భక్తిభావంపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవుడు, ప్రజల నమ్మకాలపై తాను అనని మాటలను అన్నట్లుగా రాసారని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం రెండో రోజు చంద్రబాబు మాట్లాడారు. అధికారుల్లో పోటీతత్వం పెరగాలని, అభివ్రద్ధిపై అందరూ ద్రష్టి పెట్టాలని ఆయన అన్నారు. గ్రామస్ధాయి నుంచి అభివ్రద్ధి జరగాలని, ఇందుకోసం అధికారులంతా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు 13 జిల్లాల ఎస్పీలతోనూ సమావేశం కానున్నారు.