పుట్టపర్తి సాయిబాబా మరణించి చాలా కాలం అయినప్పటికి నిత్యం ఏదో ఒక వార్తతో సంచలనం సృష్టిస్తునే ఉన్నారు.తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.పుట్టపర్తి సాయిబాబా ఫొటో నుంచి విభూది రాలుతోందంటూ వార్తలు వస్తున్నాయి.అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఆసుపత్రిలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో దీనిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఫొటో నుంచి రాలుతున్న విభూదిని నుదిట రాసుకుని వెళ్తున్నారు. ఆసుపత్రి మెయిన్ గేటుకు సమీపంలోని సేవాదళ్ గదిలో గోడపై ఉంచిన సాయిబాబా ఫొటో నుంచి విభూది రాలుతోంది.
దీన్ని గమనించిన సేవాదళ్ సభ్యులు ఫొటోకు పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు ఫొటోను దర్శించుకుని, విభూదిని తీసుకెళుతున్నారు. కొంతమంది విభూది రాలుతున్న వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఇది అంతా బాబా మహిమే అంటున్నారు అక్కడి భక్తులు.బాబా భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన ఆశీసులు మనతోనే ఉంటాయని అంటున్నారు పుట్టపర్తి సాయి బాబా ట్రస్ట్ సభ్యులు.