Sunday, May 5, 2024
- Advertisement -

ఆన్‌లైన్ ద్వారా య‌థేచ్చ‌గా వ్య‌భిచారం

- Advertisement -

నిన్న‌గాక మొన్న‌నే ఓ టీవీ యాక్ట‌ర్ వ్య‌భిచారానికి సంబంధించిన కేసులో ప‌ట్టుబ‌డింది. అది జ‌రిగి మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే మ‌ళ్లీ ఇద్ద‌రు ముగ్గురు సినీ, టీవీ న‌టీమ‌ణులు పోలీసుల‌కు పట్టుబ‌డ్డారు. ఇదంతా నిర్వ‌హిస్తున్న‌ది ఆన్‌లైన్ వ్యాపారం ద్వారా. ఓ గ‌ది అద్దెకు తీసుకోవ‌డం.. ఆన్‌లైన్‌లో ఫొటోలు, రేట్లు పెట్టేస్తే చాలు. వ్యాపారం ప్రారంభించేయొచ్చ‌నే ధీమాతో ఈ రంగంలోకి దిగుతున్నారు. అలా దిగిన వారంద‌రూ పోలీసుల‌కు ప‌ట్టుబడుతున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం చేస్తున్న ప్రాంతంపై ఎస్ ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు సినీ, టీవీ నటీమణులు, ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ టౌన్‌షిప్‌లో స్వామి అనే యువకుడు ఓ ప్లాటు అద్దెకు తీసుకుని ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అల్వాల్‌కు చెందిన నరేశ్ అనే యువకుడు ఆన్‌లైన్‌ ద్వారా ఇద్దరు అమ్మాయిలను రెండు గంటల సమయం కోసం రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. శనివారం రాత్రి ఆరు గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలు టౌన్‌షిప్‌ వద్దకు వచ్చినట్లు మల్కాజిగిరి ఎస్ ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌, ఎస్సై మహేశ్ బృందంతో క‌లిసి దాడులు నిర్వహించారు. అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారు సినీ, టీవీ నటీమణులుగా గుర్తించారు. నిర్వాహకుడు స్వామి, విటుడు నరేశ్‌ను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -