- Advertisement -
ప్రత్యేక హోదా కోసం ఇవాళ ఛలో అసెంబ్లీకి అఖిలపక్షం పిలుపునివ్వడంతో నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అసెంబ్లి ముట్టడిని అడ్డుకోవడానికి రాత్రి నుంచే పోలీసులు ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.
ఛలోఅసెంబ్లి నేపథ్యంలో విజయవాడలో చలసాని శ్రీనివాస్ సహా పలువురు నేతలను, నందిగామలో పలువురు సీపీఎం, సీపీఐ నేతలను అరెస్టు చేశారు. అసెంబ్లి ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. అఖిలపక్షం నేతల ముందస్తు అరెస్టులపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.