Thursday, May 16, 2024
- Advertisement -

పవన్… బాబును కాపాడటానికే ఇలా ట్వీట్ చేస్తున్నాడా!

- Advertisement -

ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అంశం గురించి చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వాళ్లది మోసపూరిత వైఖరే అని స్పష్టం అవుతోంది.

ఎన్నికల ముందు  ఏపీకి ఐదు, పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇప్పుడు ఆ విషంలో ఏపీ ప్రజలను మోసం చేసేలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురి అయ్యిందనే విషయాన్ని మరిచి ఏపీకి మోసం చేయడానికే నిర్ణయించినట్టుగా ఉన్నారు.

మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు అయినా.. ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడతారా? అధికార పార్టీగా స్పందిస్తూ.. రాష్ట్రం కోసం పోరాడతారా? తమ పరపతిని ఉపయోగించుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తెప్పిస్తారా? అనే ఆశలు కూడా ఫలించేలా లేవు. ఇప్పటికే తెలుగుదేశం వాళ్లు చేతులెత్తేశారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు అని కేంద్రం ప్రకటించే సరికి.. ప్రత్యేక హోదా అవసరం లేదు.. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభం ఉంటుంది.. అంటూ తెలుగుదేశం వాళ్లు ప్రకటనలు చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా.. ప్రత్యేక ప్యాకేజీతో ఉపయోగం ఉంటుంది.. ప్రత్యేక హోదాతో అన్నీ దక్కవనే విషయాన్ని గుర్తుంచుకోండి.. అంటూ కొత్త వాదన వినిపిస్తున్నాడు. ఈ విధంగా అందరూ ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోవాలనే భావనను కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. మరి అలాంటి యత్నంలో ఉన్న బాబుకు సాయంగా నిలుస్తున్నట్టుగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఒకవైపు అందరూ ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడుతూఉంటే… పవన్ రాజధాని రైతుల అంశం గురించి ట్వీట్ చేశాడు. మరి రాజధాని ప్రాంత భూ సమీకరణ గురించి చర్చ జరిగిన సందర్భంలో దాని గురించి ఏమీ మాట్లాడని పవన్ ఇప్పుడు ట్వీట్ చేస్తుండటం.. జనాలను డైవర్ట్ చేయడానికే అనుకోవాల్సి వస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -