ఒకవైపు ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం భూ సమీకరణ విషయంలో ముందుకు వెళ్లిపోతుండగా.. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ విషయంలో స్పందించాడు.
భూ సమీకరణ చట్టం ప్రకారం భూములను సమీకరిస్తున్న ప్రభుత్వ తీరు పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. భూ సమీరణ అనేది పూర్తిగా రైతుల సమ్మతంతోనే జరగాలని పవన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా బాబు ప్రభుత్వానికి హెచ్చరికను జారీ చేశాడు.
రైతులను ఒప్పించే భూ సమీకరణ చేపట్టాలని, రైతులకు నచ్చ జెప్పి లాభనష్టాలను వివరించాకే ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని పవన్ సూచించాడు. ఇది వరకూ కూడా పవన్ ఈ విషయంలో ట్వీట్ చేశాడు. రైతుల సమ్మతం లేకుండా భూ సమీకరణ చేపడితే తను పోరాటానికి సిద్ధం అని జనాసేనాధినేత గతంలో ఒకసారి ట్వీట్ చేశాడు. దీక్షకు కూడా సిద్ధం అని ప్రకటించాడు. మరి ఇప్పుడు పవన్ మరోసారి స్పందించాడు. ఈ సారి జనసేనాధిపతి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!