కన్న కొడుకులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి కషాయిగా మారింది. కుటుంబ కలహాలతో భర్తమీద కోపంతో ఇద్దరు కొడుకులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పెద్ద పల్లిజిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే…గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్, ఆర్యన్. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమా దేవి భర్త విధులకు వెల్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దీంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవిని…అక్కడున్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.