Tuesday, May 14, 2024
- Advertisement -

నీలిరంగులోకి మారిన జయరామ్ మృతదేహం…రాకేష్ రెడ్డి అరెస్ట్‌…

- Advertisement -

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జ‌యారాం మ‌ర్డ‌ర్ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఎలా జ‌రిగింద‌నే దానిపై పోలీసులు విచార‌ణ‌ను ముమ్మ‌రం చేశారు. జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోస్ట్ మార్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

జ‌య‌రామ్‌పై విష‌ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగగా, ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే, ఆయన మృతదేహం నీలిరంగులోకి మారింది. ఈ విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన పోలీసులు, విషమిచ్చి ఆయన్ను చంపి వుండవచ్చని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

ఈ కేసులో భాగంగా రాకేష్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌రెడ్డి సహాయంతోనే జయరామ్‌ను ఆమె మేనకోడలు శిఖా చౌదరి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. జయరామ్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న శిఖా చౌదరిని ప్రధాన అనుమానితురాలిగా పోలీసులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -