రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది వ్యాపార వేత్త – ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య. రెండు నెలలు క్రితం జరిగిన ఈ కేసులో రోజుకో ఓ ట్విస్ బయటపడుతు వస్తోంది. తాజాగా ఈ హత్య కేసులో ఓ సినీ నటుడు కూడా అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. టాలీవుడ్ నటుడు సూర్య ప్రసాద్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య ప్రసాద్ తెలుగులో ఆ నలుగురు, బాహుబలి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే జయరాం హత్య కేసులో గతంలోనే సూర్య ప్రసాద్ను పోలీసులు విచారించి వదిలేశారు.
కాని ఈ కేసుతో సూర్య ప్రసాద్కు సంబంధం ఉందని తెలడంతో పోలీసులు అతనని అదుపులోకి తీసుకున్నారు. సూర్య ప్రసాద్తో పాటు కిషోర్ మరియు అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రత్యక్షంగా హత్యలో పాలు పంచుకోకున్నా కూడా హత్య కుట్రలో వీరు భాగస్వామ్యులు అని పోలీసులు నిర్థారించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులు సంపాందించినట్లు తెలుస్తోంది. వీరిని రేపు మీడియా ముందు సమావేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్కు చెందిన ఓ నటుడు ఇలా ఓ హత్య కేసులో ఇరుక్కోవడంపై ఇండస్ట్రీ తీవ్ర ద్రిగ్భాంతికి లోనైంది.
- Advertisement -
హత్యకేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -