Friday, April 19, 2024
- Advertisement -

వేగంగా పోలవరం.. ఏపీ సర్కార్, మేఘాను అభినందించిన పీపీఏ సీఈవో

- Advertisement -

పోలవరం.. ఏపీ కలల ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో పూర్తి చేయిస్తుండడం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో ఏటీఎంలా మారిన పోలవరంను జగన్ గద్దెనెక్కాక టీడీపీ కాంట్రాక్టులను రద్దు చేసి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ ‘మేఘా’ చేతికి అప్పజెప్పారు.

మేఘా ఇంజీనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పోలవరం పనులు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా ఆపకుండా పూర్తి చేస్తోంది. కరోనా లాక్ డౌన్ లోనూ పనులు ఆపకుండా ముందుకు సాగింది. కూలీలను తీసుకొచ్చి మరీ పకడ్బందీగా చేస్తోంది. మొన్నటి వర్షాలకు వరదలు వచ్చినా ముందస్తుగానే గడ్డర్లు ఏర్పాటు చేసుకొని పనులు ఆగకుండా మేఘా ముందుకు సాగడం అందరిచేత ప్రశంసలు అందుకుంది.

తాజాగా పోలవరంలో వేగంగా జరుగుతున్న పనుల పై పోలవరం ప్రాజెక్ట్ ఆథార్టీ (పీపీఏ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్ వే బ్రిడ్జి,గేట్ల ఏర్పాటు,ఎగువ కాపర్ డ్యాం పనులను,ఫిష్ లాడర్ పనులను పరిశీలించారు. పోలవరం పనుల్లో తాజాగా ఏర్పాటు చేసిన ఆర్మ్ గర్డర్స్ పరిశీలించిన చంద్రశేఖర్ అయ్యర్ మేఘా సంస్థ పనితీరును ప్రశంసించారు. రేపు సాయంత్రానికి పోలవరం ప్రాజెక్ట్ లో తొలి గేట్ అమరుస్తున్నామని అయ్యర్ కి తెలిపిన పోలవరం ప్రాజెక్ట్ అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నిపుణులు పనులను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

పోలవరం పనులు పరిశీలించిన అనంతరం పీపీఏ సిఈఓ చంద్ర శేఖర అయ్యర్ మీడియా తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వాన్ని, మేఘా సంస్థను ప్రశంసించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -