- Advertisement -

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాలు, రాజకీయ చర్చల అనంతరం అమరావతిని రాజధానిగా గుర్తించే దిశగా కీలక అడుగులు వేస్తోంది కేంద్రం.

రాష్ట్ర విభజన సమయంలో చేసిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 5(2)ను సవరించేందుకు ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. ఈ సవరణతో రాజధాని నిర్ణయంపై ఉన్న అనిశ్చితి తొలగి, అమరావతికి శాశ్వత రాజధాని హోదా లభించనుంది. సవరణ ముసాయిదాకు కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తదుపరి దశలో, ఈ సవరణ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం పరిశీలించి ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇరు సభల ఆమోదం పొందిన తర్వాత, అమరావతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, ఏపీ రాజధాని విషయంపై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పల్కొనబడే అవకాశముంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో అమరావతి కీలక కేంద్రంగా పునరుద్ధరణ పొందనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -