కరీంనగర్ లో ఎవ్వర్కి తెలియకుండా గుట్టుచప్పుడుకాకుండా జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు అడ్డంగా పట్టుకున్నారు. పార్టి పేరుతో.. ఇక యువతి, ఐదుగురు విటులు ఎంజా చేస్తుండగా.. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో.. అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్ ప్రాంతంలో నెల్లుట్ల వనిత కొన్ని నెలలుగా కృష్ణనగర్ ప్రాంతంలో తన ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది.
హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి యువతులను, చదువుకునే విద్యార్థులను కరీంనగర్కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చింది. తాజాగా కూడా కొందరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తుందనే సమాచారం మేరకు ఆ గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా కాకినాడకు చెందిన ఒక యువతితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 34 వేల రూపాయలు, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.