ఇందిరా కోడలైనా… రాజీవ్ భార్య అయినా… చట్టం ముందు అందరూ సమానులేనని నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో సోనియా ప్రమేయం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
తాను దత్తత తీసుకున్న గ్రామానికి గెయిల్ సంస్ధ రూ.రెండు కోట్లను విడుదల చేయడంతో పాటు మొత్తం రూ.తొమ్మిది కోట్లతో దుర్గి మండలంలోని ధర్మవరాన్ని అభివృద్ది చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకులను ఊసర వెల్లి లతో పోల్చడం సరిగ్గా సరిపోతుందని రాయపాటి నిరూపించారు. కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో సోనియా పై పొగిడి, ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడానికి ఇదే నిదర్శనం .
కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి రూ. రెండు వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారనే సోనియా, రాహుల్ పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టు ఆశ్రయించగా, ఈ కేసులో సోనియా, రాహుల్ ఈనెల 19న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘నేను ఇందిరా కోడలిని.. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేద’నే వ్యాఖ్యలు చేసింది.