Friday, May 10, 2024
- Advertisement -

ఆర్‌.జి.విని వాడుకున్న టిడిపి!

- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ రోజుకొక ట్వీట్‌తో అందర్నీ ఆకర్షిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ తెలుగు దేశం నేతలు బాగా ఉపయోగ పెట్టుకుంటున్నారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 30మందికి పైగా భక్తులు మరణిచిన సంగతి తెలిసిందే.

అయితే ఇలా జరగడానికి కారణం చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ నేతలే అని ప్రతిపక్షాలు దుమ్మెతిపోశాయి. కానీ తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్స్ అందుకు భిన్నంగా ఉన్నాయి, సంచలనాలు రేపుతున్నాయి. “అంతమంది చనిపోవడానికి కారణం దేవుడే అని, చంద్రబాబు కాదని పేర్కొన్నారు. దేవుడు వాళ్ళను చనిపోకుండా ఆపి ఉండొచ్చు కదా, ఎందుకు ఆపలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరైతే బతికున్నారో వారు మాత్రమే దేవుని భక్తులా!? అని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడినే బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు ఎవరు దేవుడిని బ్లేమ్ చేయటం లేదు అని ప్రశ్నించారు. దేవుడు తమ నిజమైన భక్తులని రక్షించలేనపుడు చంద్రబాబు ఏం చేస్తారని ఆయన ట్వీట్ చేశారు.” 

వర్మ చేసిన ట్వీట్స్‌ని టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు సమర్ధించారు. వర్మ చెప్పిన మాటలు నిజమే, అనవసరంగా రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు చంద్రబాబును, టిడిపి ప్రభుత్వాన్ని బ్లేమ్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వర్మ చెప్పిన విదంగా అంతా దేవుడిపైనే భారం వేయాలని అన్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -