- Advertisement -
రాఖీ పండగ రోజున వైకపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి నేనున్నా అంటూ ఫైర్ బ్రాండ్ రోజా రాఖీ కట్టి తనకి జగన్ మీద ఉన్న సోదరి ప్రేమని చాటుకున్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకుని హైదరాబాదులోని జగన్ నివాసానికి తన కుమార్తెతో కలిసి వెళ్లిన రోజా ఆయన చేతికి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా జగన్ – ఆయన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రోజా జగన్ ను తన సొంత అన్నగా భావిస్తూ తానుండగా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సర్కారు తనని కుట్రపన్ని అసంబ్లీ నుంచి బయటకి పంపినప్పుడు కూడా జగన్ తనకి అండగా ఉన్నారు అని తాను జగన్ ని సొంత అన్నకంటే ఎక్కువగా భావిస్తున్నాను అని రోజా చెప్పారు. జగన్ తనతో ఉన్నంతకాల ఎవ్వరూ తనని ఏమీ చెయ్యలేరు అంటూ చెప్పుకొచ్చారు రోజా.