Monday, May 6, 2024
- Advertisement -

సంచ‌ల‌నంగా మారిన ’న‌న్ను బ‌తికించండి డాడీ’ అంటూ చిన్నారి వీడియే

- Advertisement -
Sai Sri died lack treatment and father neglect

మ‌రోసారి మాన‌వ‌త్వం మంట మంట‌గ‌ల‌చింది. అధికార‌పార్టీ నాయ‌కుల గుండా గిరికి అభం శుభం తెలియ‌ని ఓ చిన్నారి బ‌లి అయ్యింది. చిన్నారి మ‌ర‌ణం ఇప్పుడు విజ‌వాడ‌లో సంచ‌ల‌నంగా మారింది. క్యాన్స‌ర్‌తో చ‌నిపోయిన చిన్నారి నాన్న న‌న్ను బ‌తికించండంటూ తండ్రికి పంపిన సెల్పీవీడియే అంద‌రి మ‌న‌సుల‌నూ క‌ల‌చివేస్తోంది..

బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీ యులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ (13) ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.బొండా ఉమా వర్గీయుల రౌడీయిజానికి నిదర్శనంగా నిలిచి ఈసంఘ‌ట‌న ఇప్పుడు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.
మాదంశెట్టి సుమశ్రీ , శివకుమార్ దంపతులు కుమార్తె సాయిశ్రీ. చిన్నారి పేరిట తన తండ్రి విజయవాడ దుర్గానగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ రాసిచ్చారు. భర్త నుంచి విడిపోయిన సుమశ్రీ విజయవాడలోని ఇంటిని అద్దెకు ఇచ్చి హైదరాబాద్‌లో ఉంటోంది. అయితే కుమార్తె సాయిశ్రీకి క్యాన్సర్ వచ్చింది. శక్తి మేర తన వద్ద ఉన్న డబ్బును ఖర్చు పెట్టిన సుమశ్రీ.. మెరుగైన వైద్యం కోసం సాయిశ్రీ పేరిట ఉన్న ఇంటిని అమ్మాలని భావించారు. ఆ ఇల్లు మైనర్‌ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్‌ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లుతల్లడిల్లిపోయారు.ఇందుకోసం విజయవాడ రాగా అప్పుడు అసలు విషయం అర్థమైంది.

{loadmodule mod_custom,Side Ad 1}

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా బ్యాచ్ ఆ ఇంటిని కబ్జా చేసింది. అక్కడికి వచ్చిన సుమశ్రీ, క్యాన్సర్‌తో బాధపడుతున్న సాయిశ్రీని రెండు రోజుల పాటు బయటే ఉంచారు. ఇల్లు తమదని… ఏదైనా ఉంటే ఎమ్మెల్యే బోండా ఉమా వద్దకు వచ్చి సెటిల్‌ చేసుకోవాలని బెదిరించారు బోండా అనుచరులు. పోలీసులను ఆశ్రయించినా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు భయపడి ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో సాయిశ్రీ తండ్రి శివకుమార్‌ కూడా మౌనంగా ఉండిపోయాడు. దీంతో సాయిశ్రీ సెల్ఫీ వీడియోలో తనతండ్రిని వేడుకుంది.
”నాన్న నేను ఎక్కువ రోజులు బతకనంటున్నారు. ఇల్లు అమ్మేందుకు సాయం చేయి డాడీ. ఇల్లు అమ్మి నాకు వైద్యం చేయించి బతికించు నాన్న. ట్రీట్‌మెంట్ చేయిస్తే నేను హ్యాపీగా స్కూల్‌కు వెళ్తా నాన్న. దండం పెడుతా నన్ను బతికించు. నా చేయి కూడా వాచిపోయింది. నా ప్రాణాలు కాపాడు డాడీ.. చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ.. చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ.. కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ.. కుంటుతూ నడుస్తున్నా డాడీ.. దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్‌లో నువ్వు రెస్పాండ్‌ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్‌ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. నేను కూడా నీ కూతురునే కదా డాడీ.. ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ అంటూ తండ్రికి పంపిన చిన్నారి వీడియే అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

కానీ ఆ తండ్రి మనసు కరగలేదు. దీంతో ఈ దుర్మార్గపు లోకాన్ని జయించలేక చిన్నారి సాయిశ్రీ ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. కూతురు కళ్ల ముందే చనిపోతున్నా బతికించుకోలేకపోయిన సుమశ్రీ బోరున విలపించారు. తన బిడ్డ చావుకు ఎమ్మెల్యే బోండా ఉమాయే బాధ్యత వహించాలని సుమశ్రీ అన్నారు. ఇంటిని అమ్ముకోవడాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే బొండా ఉమాను పలుసార్లు ప్రాథేయపడ్డాను. వారు ఏమాత్రం కనికరించలేద‌ని ఆ త‌ల్లి త‌న అవేద‌న వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -