- Advertisement -
ఉద్యోగులను కంట్రోల్లో పెట్టాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి. ఉద్యోగుల విషయంలో చేయగలిగినవి ఏమున్నా చట్టసవరణ చేసైనా చేయడానికి సీఎం సిద్దంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే తామే కాదనీ.. ఉద్యోగులు కూడా వస్తారన్నారు.
అందరి సహకారంతోనే ప్రభుత్వం పనిచేస్తుందినీ.. మంచిరోజులు వస్తాయియని తెలిపారు. కడప జిల్లాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టా రెడ్డి పర్యటించారు. జిల్లాలో ఎన్జివోస్ సహాకార గృహనిర్మాణ సంఘం నిర్మించిన అపార్ట్మెంట్ను సజ్జల ప్రారంభించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు మంచి సహకారం అందించారని తెలిపారు. ఉద్యోగులపై సజ్జల కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
Also Read: పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం