నంద్యాల ఎన్నికల ప్రచారంలో రాజకీయంగా కాకుండా వ్యక్తిగత విషయాలపై ఆరోపనలు చేసుకుంటున్నారు. నిన్న శిల్పా కుటుంబంపై చంద్రబాబు చేసిన ఆరోపణల పట్ల శిల్పా ఫ్యామిలీ తీవ్రంగా స్పందించింది. ప్రెస్మీట్ పెట్టి ఓ రేంజ్లో బాబును ఏకేశారు శిల్పామోహన్ రెడ్డి, ఆయన కుమారుడు, కుమార్తె, కోడలు.
శిల్పా మహిళా సహకార బ్యాంకుకు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడంపై వారు మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన వ్యక్తి … మహిళల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకును దెబ్బతీసేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని బ్యాంకు చైర్పర్సన్ , శిల్పామోహన్ రెడ్డి కోడలు నాగినిరెడ్డి ప్రశ్నించారు. తక్కువ వడ్డీకే తాము రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు వేదికగా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్దమని ఆమె సవాల్ చేశారు.
వైసీపీ తరుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని..వారిలో నలుగురు మంత్రులయ్యారని వారు టీడీపీలో కొనసాగె హక్కులేదన్నారు శిల్పా మోహన్రెడ్డి కూతురు. ఫిరాయింపుల గురించి ప్రశ్నిస్తే బాబు మొహం చాటేస్తున్నారని ఎద్దేవ చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని శిల్పా మోహన్రెడ్డి కొడుకు విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో రాత్రి రెండు గంటలకు తమను ఇంటికి పిలిపించుకుని నంద్యాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని అభినందించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలను నారా లోకేష్ కూడా మొచ్చుకున్నారు. ఇప్పుడు మాత్రం శిల్పా పార్టీ మారితే విమర్శిస్తున్నారాని ప్రశ్నించారు. తప్పులన్నీ మన వైపు పెట్టుకొని మాట్లాడితే…తర్వాత సమాధానం చెప్పడానికి ఏమి ఉండదని తెలుసుకుని మాట్లాడితే బాబుకు మంచిది.