Thursday, May 9, 2024
- Advertisement -

వీళ్లు.. ఎన్టీఆర్, వైఎస్ ల కన్నా మగాళ్లా అనేసిన శివాజీ!

- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలన్న డిమాండ్ తో వార్తల్లోకి వస్తున్న హీరో శివాజీ ఆసక్తికరమైన రీతిలో మాట్లాడాడు. ఈ విషయంలో దీక్షలు.. నిరసనలు అంటూ హల్ చల్ చేస్తున్న తరపై వస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానం చెప్పాడు.

తను చాలా అతి చేస్తున్నాని అంటున్న నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్ల మాటలను తను పట్టించుకోనని శివాజీ స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా శివాజీ.. ఎన్టీఆర్, వైఎస్ ల పేర్లు ప్రస్తావించడం విశేషం.
ఇప్పుడున్న రాజకీయ నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ ల కన్నా మగాళ్లా…? అని శివాజీ ఆవేశంగా ప్రశ్నించాడు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించాల్సిన వీళ్లు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని శివాజీ వ్యాఖ్యానించాడు. కొందరు పెద్ద మనుషులు తనను టార్గెట్ చేయడం ఏమిటని శివాజీ ప్రశ్నించాడు.
ప్రత్యేక హోదా విషయంలో తను తగ్గేది లేదని.. ప్రత్యేక హోదా దక్కే వరకూ తను ఇంతేనని శివాజీ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి శివాజీ మాటల్లో పదును అయితే పెరుగుతున్నట్టుగానే ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -