Saturday, May 18, 2024
- Advertisement -

190 ప‌రుగుల‌కు 8 వికెట్లు కోల్పోయిన లంక‌…

- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీ విరామం అనంతరం భారత్‌ బౌలర్లు పుంజుకున్నారు. శ్రీలంక సారథి దినేశ్‌ చండీమాల్‌ మినహా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో టీమిండియా వికెట్ల వేట కొనసాగిస్తోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ముగించేందుకు భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ బౌలింగ్‌లో శనక(2), జడేజా బౌలింగ్‌లో దిల్రువాన్‌ పెరీరా(15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ప్రస్తుతం 73 ఓవర్లు ముగిసేసరికి 190/8 పరుగులు చేసింది.

భార‌త బౌల‌ర్లు ఏమాత్రం లంక‌బ్యాట్స్ మెన్‌ల‌కు అక‌వాశం ఇవ్వకుండా క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేస్తున్నారు. మొద‌టి టెస్ట్‌లో విఫ‌ల‌మ‌యిన స్పిన్న‌ర్లు రెండో టెస్ట్‌లో వికెట్ల ప‌రంప‌రను కొన‌సాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -