అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 29 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్. వీరిలో ఎన్నికల ప్రచార కమిటీ మాజీ ఛైర్మన్ పాల్ మనఫోర్ట్, అతని మేనల్లుడి తండ్రి చార్లెస్ కుష్ణార్ ఉన్నారు. దీంతో గడిచిన రెండు రోజులుగా ట్రంప్ క్షమాభిక్ష పెట్టినవారి మొత్తం సంఖ్య 49కు చేరింది.
తాజా 29 మందిలో వివిధ కేసుల్లో దోషులుగా తేలినవారితో పాటు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై ‘రాబర్ట్ మ్యూలర్’ చేపట్టిన దర్యాప్తులో నేరస్థులుగా తేలినవారు ఉన్నారు. ఇరాక్ విధ్వంసకాండలో దోషులైన కాంట్రాక్టర్లూ ఉన్నారు.
మ్యూలర్ దర్యాప్తు అధికారులతో అబద్ధాలు చెప్పి.. 30రోజుల జైలు శిక్ష ఎదుర్కొన్న డచ్ న్యాయవాది అలెక్స్ వాన్ డర్ జ్వాన్కు ట్రంప్ తాజాగా క్షమాభిక్ష ప్రసాదించారు. స్వచ్ఛంద సంస్థల పేరిట మనీలాండరింగ్కు పాల్పడ్డ స్టీవ్ స్టాక్మ్యాన్ అనే రిపబ్లికన్ తరఫున మాజీ కాంగ్రెస్ సభ్యుడుకి శిక్షను తగ్గించారు ట్రంప్.
