Tuesday, May 14, 2024
- Advertisement -

కృష్ణాజిల్లాలో దారునం..ప్రేమ వేధింపుల‌కు యువ‌తి బ‌లి…

- Advertisement -

ప్రేమ వేధింపులు తాల‌లేక ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న కృష్ణాజిల్లాల్లో క‌ల‌క‌లం రేపింది. ప్రేమిస్తున్నానంటూ వెంట ప‌డి వేధించాడు. అమ్మాయికి ఇష్టంలేక‌పోయినా వేధించ‌సాగాడు. యువ‌తి త‌ల్లిదండ్రులు యువ‌కున్ని మంద‌లించినా అత‌నిలో మార్పురాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే ఝాన్సీ ఓప్రవేట్ కళాశాలలో చదువుతుంది. ఝాన్సీని గోపి అనే యువకుడు ప్రేమించమంటూ వెంటపడేవాడు. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో తనను ప్రేమించమని వేధించేవాడు. త‌ల్లిదండ్రుల‌కు చెప్పినా ఫ‌లితం లేక‌పోయింది.

అయితే మంగళవారం కళాశాలకు వెళ్లిన ఝాన్సీ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బస్టాండ్ వద్ద అడ్డగించి తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించాడు. అందుకు ఝాన్సీ నిరాకరించడంతో చంపుతానని హెచ్చరించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఝాన్సీ ఇంటికి వచ్చి పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి గోపియే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపినీ వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -