- Advertisement -
క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై సినీ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 21 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)కి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్గా ఎంపికయ్యారు. ఇందులో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. టాలీవుడ్కి సంబంధించిన విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై దుమారం చెలరేగుతోన్న నేపథ్యంలో క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని సమాచారం. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. వారిలో సగం మంది ప్రజా సంఘాలు, లాయర్లు ఉంటారు. టాలీవుడ్కి సంబంధించిన విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
