- Advertisement -
కేంద్ర కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీ ఆమె కుటుంబాని కీ అత్యంత విధేయులు ఎవరు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ వినపడే పేరు తీ సుబ్బిరామిరెడ్డి. ఈ కుటుంబానికి ఆయన టికెట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మిన బంటులాగా ఉన్నారు. అలాంటి ఆయన ఇప్పుడు వైకపా లోకి జంప్ అవుతున్నారు అనే వార్త హల్చల్ చేస్తోంది.
విశాఖ స్వరూపానంద వీరిద్దరినీ కలపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నాయి మీడియా వర్గాలు. వైసీపీ విశాఖపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికి తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని ఉపయోగించాలని వైసీపీ అధినేత జగన్ డిసైడైయ్యారట.
అయితే ఈయనకు సుబ్బరామిరెడ్డికి మధ్య అంతగా రాజకీయ చర్చలు జరిపే ఫ్రెండ్ షిప్ లేదు. దీంతో గత కొన్నాళ్లుగా తనను చేరదీసి – సలహాలు – సూచనలు ఇస్తున్న ఆధ్యాత్మిక గురువు స్వరూపానంద రంగంలోకి దిగారని సమాచారం.