Saturday, April 20, 2024
- Advertisement -

తమిళనాట విషాదం.. ఆక్సీజన్ అందక 11 మంది మృతి

- Advertisement -

దేశంలో ప్రతిరోజూ కరోనా తీవ్రత ఘోరంగా చూపిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్ కొరత ఏర్పడుతుంది. ఎంతో మంది ఆసుపత్రి బయటనే ప్రాణాలు విడిచే పరిస్థితి ఏర్పడుతుంది. దేశరాజధాని ఢిల్లీలో పదుల సంఖ్యలో పేషెంట్లు ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే.

ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లోనూ ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తమిళ నాట విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు. చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో.. మంగళవారం రాత్రి సమయంలో పేషెంట్లు ప్రాణాలు వదిలారు. ఇక కళ్ల ముందే పేషెంట్లు చనిపోతున్నా.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో డాక్టర్లు సైతం కంటతడిపెట్టడం అందర్నీ కలచివేసింది.

ఈ విషయం తెలుసుకున్న చెంగల్‌పట్టు కలెక్టర్ జాన్ లూయిస్ పరిస్థితిని సమీక్షించారు. ఆక్సిజన్ కొరత కారణంగా పేషెంట్లు చనిపోయిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం ఒక్క రోజే ఈ జిల్లాలో 1608 మంది కోవిడ్ బారిన పడ్డారు.చెంగల్‌పట్టు జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజూ 1500కిపైగా కేసులు నమోదవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -