Friday, May 17, 2024
- Advertisement -

చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు – అంతా అయిపొయింది

- Advertisement -

తెలంగాణా లో టీడీపీ పీకలలోతు లో కూరుకుపోయింది, అత్యంత ముఖ్యమైన నాయకత్వం లేక ఆ పార్టీ అక్కడ చతికిల పడింది. ఉన్న దానికి నారా లోకేష్ మరింత నెగెటివ్ యాడ్ చేసినట్టు అయ్యింది. రేవంత్ రెడ్డి లాంటి రాత్రికి రాత్రి హైప్ ఉన్న వ్యక్తులని కూడా చంద్రబాబు ఇగ్నోర్ చేసి మరొక పెద్ద తప్పు చేసారు.

ఇప్పటికే శాసనసభ పక్ష నేత తో సహా అందరూ పార్టీని వీడేవారే. ఇవాళో రేపో మిగిలిన కొద్దిమంది కూడా జంప్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.తెలుగు దేశాన్ని జాతీయ పార్టీగా విస్తరించాలి అని కల గంటున్న చంద్రబాబు కల కలగానే మిగిలిపోయెలా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా ఏమీ చెయ్యలేక ఆయన కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతుండడం విశేషం. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించలేనని… ఏపీపై మాత్రమే దృష్టి పెడతానని స్పష్టం చేసేశారు.

దీంతో చంద్రబాబుపై ఇంకా నమ్మకం ఆశలు ఉన్న కొద్ది మంది టీటీడీపీ నేతలు కూడా ఇక లాభం లేదనుకుంటున్నారట. చంద్రబాబుతో రీసెంటుగా భేటీ అయిన టీటీడీపీ నేతలు చంద్రబాబు హ్యాండ్సప్ పొజిషన్ చూసి ఇక ఆయన చేసేదేమీ ఉండదని… మనదారి మనం చూసుకోవడం బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

దాదాపు ఐదు గంటల సమయం చర్చించిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు బాబు. కష్టాల్లో ఉన్న పార్టీ కి బాబు క్రియాశీలకంగా దారి చూపిస్తారూ, సలహాలు ఇస్తారూ అని ఊహించిన వారికి ఇలాంటి కష్టం ఎదురు అయ్యింది. ” నాకు ఏపీ లో ఉన్న తలనొప్పులు చాలు, ఇక్కడ ఉన్న ఛాలెంజ్ లనే నేను ఎదురుకోలేక తలనొప్పి తెచ్చుకుంటున్నాను, అక్కడ సంగతి మీరే చూసుకోండి ఎవరో ఒకరిని లీడర్ గా ఎన్నుకుని మరీ మీ నాయకుడిని మీరే తెచ్చుకోండి ” అని బాబు అన్నట్టు తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -