ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసలు జోరుగా పెరుగుతున్నాయి. 2014 ఎన్నికలు అయిన తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల యంపి యస్ పీ వై రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచే ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిదులు టీడీపీలో చేరడం మరింత పెరిగింది.
అంతేగాక 21 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికతో మరింతమంది చేరుతారాని మీడియాకు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే ఇప్పుడు వాటికి బ్రేక్ పడింది. టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా సగం మంది తిరిగి వైసీపీలోకి వస్తున్నట్లు సమచారం. కడప ,నెల్లూరు,కర్నూలు జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను కోనుగోలు చేసి గెలిచిన అది గెలుపు కాదు. పట్టభధ్రులు,టీచర్స్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది.
దీంతో వందల కోట్లు పెట్టి గెలిచిన.. పట్టభధ్రులు,టీచర్స్ ఎన్నికల్లో ఎందుకు టీడీపీ గెలవలేదో తెలుసుకోని తిరిగి వైసీపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. వైసీపీ గెలుపుతో టీడీపీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. కనుక 2019 ఎన్నికల్లో ఏపీలో భారీ మెజార్టీతో గెలుస్తుందని అంతర్గతంగ చేబుతున్నారు. నంద్యాల బై ఎలక్షన్ తర్వాత టీడీపీలో ఉంటే డిపాజిట్లు కూడా రావు అని దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సిద్దంగ్ అవుతున్నట్లు సమచారం.