Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీనీ, బాబును అడ్డంగా ఇరికించిన జేసీ దివాక‌ర్ రెడ్డి…

- Advertisement -

ఇప్ప‌ట్లో డ‌బ్బులు లేని ఎన్నిక‌లు ఊహించ‌లేం. అన్ని పార్టీలు వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టంది ఎన్నిక‌ల‌కు వెల్ల‌వు. ఇది అంద‌రికి తెలిసిందే. తాజాగా జేసీ చేసిన వ్యాఖ్య‌లు బాబుతో పాటు టీడీపీనీ ఇరుకున పెట్టేశాయి. జేసీ ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి. ఆముక్కుసూటి వ్యాఖ్య‌లే బాబుకు ఇబ్బందులు క‌లిగిస్తున్నాయి.

పోలింగ్ ముగిసిన‌ప్ప‌టినుంచి జగన్ భారీ డబ్బులు ఖర్చుపెట్టారని.. ఓట్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు తన వాళ్లతో వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈవీఎల వల్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా డబ్బు ఖర్చుపెట్టడం వల్ల.. అని తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేసుకునే ప్రయత్నంలో టీడీపీకి జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తనకే రూ.50కోట్లు ఖర్చు అయ్యాయని నోరు జారారు. ఓటుకు రెండువేల రూపాయలు ఇచ్చాం..’ అంటూ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాక ”పసుపు-కుంకుమ” డబ్బులు బాగా ఉపయోగపడ్డాయి. అవి గనుక ఆడవాళ్లకు చేరకపోయి ఉంటే అంతే సంగతులు…’ అని జేసీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే టీడీపీని కొంపముంచుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ భారీగా డబ్బులు పంచింది అని చంద్రబాబు నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో జేసీ దివాకర్ రెడ్డి తాము ఓటుకు రెండువేల రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. బాబు ప‌డుతున్న క‌ష్టాన్ని జేసీ బూడిద పాలు చేశార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -