Wednesday, May 15, 2024
- Advertisement -

తెలుగుదేశం వైకాపాపై ఇక అలా దాడి చేస్తుందా..!

- Advertisement -

ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పై దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీకి కొత్త పాయింట్ దొరికేలా ఉంది. ఇప్పటికే వైకాపా అధినేత జగన్ పై ఏపీలోని తెలుగుదేశం పార్టీ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు.

రకారకాలుగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం నేతలకు మరో అస్త్రం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనమండలి ఎన్నికలను ఆధారంగా చేసుకొని టీడీపీ వైకాపాపై విరుచుకుపడే అవకాశాలున్నాయి.

తెలంగాణ శాసనసభ కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా విలువైనదే. తెలంగాణ రాష్ట్ర సమితి ఐదో అభ్యర్థిని నిలపడటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వైకాపా వైపు ఒక ఎమ్మెల్యే ఉన్నా.. అతడి ఓటు కూడా విలువైనదిగా మారింది. ఆ ఓటు కూడా ఒక ఎమ్మెల్సీ విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో అధికార తెరాస పార్టీ ఆ  ఎమ్మెల్యే ఓటును తమకు వేయించాలని వైకాపాను కోరుతోంది!

మరి వైకాపా గనుక ఆ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకొంటే.. తెలుగుదేశం పార్టీకి కొత్త అస్త్రం దొరికినట్టే. వైకాపా అభ్యర్థి తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే అది.. జగన్ , కేసీఆర్ ల మధ్య కుదిరిన ఒప్పందం అని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో ఇప్పటి వరకూ వైకాపా ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏం జరుగుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -