Monday, April 29, 2024
- Advertisement -

బాబు అడిగి ఉంటే దాన్ని దానమిచ్చే వాళ్లం: వైసీపీ

- Advertisement -

తమను తెలుగుదేశం అధినేత ఆ సీటు కావాలని అడిగి ఉంటే దానంగా పడేసేవాళ్లం అని.. కానీ ఆయన అడగకుండా..అడ్డగోలుగా వ్యవహరించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అంటూ మండిపడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఈ ప్రకటన చేసింది.

ప్రత్యేకించి కర్నూలు  వైకాపాకు మెజారిటీ ఉన్న అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలపడంపై వైకాపా నేతలు ఈ విధంగా స్పందించారు. 

కర్నూలు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల బలాబలాలను బట్టి చూస్తే వైకాపాకు ఆ సీటు దక్కుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ అక్కడ తన అభ్యర్థిని బరిలో నిలిపింది. వైకాపా నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను తనవైపుకు తిప్పుకొని గెలవడమే తెలుగుదేశం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. బలం లేకపోయినా తెలుగుదేశం పోటీ చేస్తోందంటే.. అది ప్రలోభాలకు గురి చేసే వ్యూహంతో చేయడమే అని వైకాపా ఆరోపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో బాబుపై విరుచుకుపడుతూ… బాబు కు అంతగా సీటు మీద మోజు ఉంటే తమ దగ్గర అడుక్కుతినాల్సిందని.. అప్పుడు తాము దానం చేసే వాళ్లమని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో గెలిచేదెవరో.. ఓడెదెవరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -