- Advertisement -
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలపై చర్చ జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై రాజీవ్ శర్మ ఈ భేటీలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్పై అధికారాన్ని వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.