- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు రాష్ట్రంలో జోరందుకున్నాయి. ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ భేటీ అయ్యారు.
ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఈఓ రజత్కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినా తాము సిద్దమేనని వెల్లడించారు. బ్యాలెట్ మిషన్లు, వివి పాట్ మిషన్లు నవంబరు కల్లా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా 2018 జనవరి ఓటర్స్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.