Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణలో ప్రమాద హెచ్చరిక

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో అయితే గడచిన రెండు రోజులుగా సూర్యుడు భగభగమంటున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలు, పట్టణాలు జన సంచారం లేకబోసిపోతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఈ ఎండలకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పిల్లలు, వృద్ధులను సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వడ దెబ్బ తగిలి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -