Sunday, May 5, 2024
- Advertisement -

సర్పంచ్ పదవి విలువ రూ.2.5 కోట్లు..!

- Advertisement -

సాధారణంగా పదవులు అంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటాయి. చిన్న పదవి నుంచి పెద్ద పదవుల కోసం కొన్నేళ్లుగా ఎంతో వెచ్చిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లా ఉమ్రానె గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించారు.

ఈ వేలంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ప్రశాంత్ విశ్వాస్​రావు దేవరా అనే వ్యక్తి పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన ఈ వేలం.. కోటి పదకొండు లక్షలతో ప్రారంభమైంది.

ఎన్నికల ప్రక్రియ లేకుండా గ్రామస్థులంతా సర్పంచ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే ఈ వేలాన్ని నిర్వహించారు. ప్రశాంత్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. అయితే ఈ వేలాన్ని అధికారికంగా నిర్వహించలేదు. వేలంలో వెచ్చించిన డబ్బుతో గ్రామంలో రామేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపడతారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -