Friday, March 29, 2024
- Advertisement -

నేటి నుంచి కౌశల్​ వికాస్ యోజన మూడో విడత ప్రారంభం..!

- Advertisement -

దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో శుక్రవారం నుంచి ప్రధానమంత్రి కౌశల్​ వికాస్ యోజన మూడో విడత ప్రారంభం కానుంది. ఈ సారి నవ యుగ, కొవిడ్​ సంబంధిత నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు కేంద్రం ప్రకటనలో తెలిపింది.

స్కిల్​ ఇండియా మిషన్​లో భాగంగా పీఎంకేవీవై మూడో విడత కోసం 2020-21 ఏడాదికి గానూ రూ. 948.90 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. దాదాపు 8 లక్షల మంది నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది.

ఈ పథకం మొదటి రెండు విడతల్లో నేర్చుకున్న విషయాల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన విధానాలను రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. నైపుణ్యం గల నిపుణులను అందించేందుకు 729 పీఎం కౌశల్​ కేంద్రాలు, 200కు పైగా ఐటీఐలను శిక్షణా కేంద్రాలుగా ఎంచుకున్నట్లు వివరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -