Wednesday, May 8, 2024
- Advertisement -

ఈ ఫోటో..బాబు ఇమేజ్ ను భారీగా దెబ్బతీస్తోంది..!

- Advertisement -

నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎదురుదాడి చేసే వాళ్లు.. ఆ పార్టీ అభిమానులు కూడా అవతలి వారిపై విరుచుకుపడేవాళ్లు. పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకు తెలుగుదేశం అధినేత చంద్రబాబే కారణం..

తన పబ్లిసిటీ పిచ్చితో బాబు అంత ప్రమాదానికి కారణం అయ్యాడు… ని వచ్చే విమర్శల పట్ల వారు ఘాటుగా స్పందించేవారు. బాబు మూడు గంటల సేపు పుష్కర స్నానం చేశాడు అని.. దీని వల్లనే జనాల్లో అసహనం అధికం అయ్యి తొక్కిసలాట జరిగిందని వార్తలు వచ్చాయి.

ఆ మూడుగంటల్లో షార్ట్ ఫిలిమ్ షూటింగ్ జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా.. తెలుగుదేశం వారు ఎదురుదాడి చేశారు. అయితే ఇప్పుడు పక్కా ఆధారాలు దొరికాయి. బాబు గోదారికి హారతి ఇస్తుండగా.. పక్కనే దర్శకుడు బోయపాటి శ్రీను చేతిలో మైక్ పట్టుకొని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. అచ్చం సినిమా షూటింగ్ వలె బాబు పోజు ఇస్తుంటే.. దర్శకుడు పక్క నుంచి కెమెరామెన్ కు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. మరి దీన్ని బట్టి బాబు పుష్కర స్నానం అనేది సినిమాటిక్ గా జరిగిందని.. అందుకు సంబందించి వీడియో చిత్రీకరణ జరిగిందని స్పష్టం అయ్యింది.

మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అవకాశం లేకుండాపోయింది. బాబు ఫుష్కర స్నానాన్ని తెరకెక్కించిన వైనం నిజం అని తేలింది. దీంతో తమ్ముళ్లు వివరణ ఇచ్చుకోవడానికి.. ఎదురుదాడి చేయడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి బోయపాటి శ్రీనుతో కూడిన పోటో చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీస్తోందని చెప్పవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -