Friday, May 17, 2024
- Advertisement -

‘భరత్ అనే నేను’పై పంచ్ వేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరామ్

- Advertisement -

భ‌ర‌త్ అను నేను సినిమా విడుద‌లకు ముందే రాజ‌కీయ పార్టీల‌కు టార్గెట్ అయ్యింది.మ‌హేష్ బాబు న‌టించిన ఈ సినిమా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన రాజ‌కీయ‌ల‌పై ఉంటుంది చిత్ర యూనిట్ ముందే ప్ర‌క‌టించింది.అయితే మ‌హేష్ బాబుకి టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌కి సంబంధం అనుకుంటున్నారా! ఏం లేదండీ …తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేత, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో సభ పెడితే అక్కడికి వచ్చే వాహనాల పొగ కారణంగా కాలుష్యం పెరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే, అనుమతివ్వడం లేదని పోలీస్ శాఖ చెప్పిందని అన్నారు.మరి, ఇటీవల ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతిచ్చారని, ఆ వేడుకకు వాహనాలు రాలేదా? వాటి నుంచి పొగరాలేదా? అని ఆయన ప్రశ్నించారు.ఉద్దేశ్యపూర్వకంగానే కెసీఆర్ త‌మ‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండ మ‌హేష్ సినిమా ఫంక్ష‌న్‌కు అనుమ‌తి ఇచ్చార‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆయ‌న మండిప‌డ్డారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -