- Advertisement -
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఇద్దరు చైనా జాతీయులకు ఈడీ కస్టడీ విధించినట్లు అధికారులు తెలిపారు. చార్లీ పెంగ్, కార్టర్ లీ అనే వ్యక్తులను కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అప్పగించినట్లు చెప్పారు.
వీరిపై రూ.1000 కోట్ల విలువైన హవాలా రాకెట్ను నడుపుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. వీరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ సోదాలు నిర్వహించిన తర్వాత మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.
చార్లీ పెంగ్ వద్ద నకిలీ భారత పాస్పోర్ట్ సైతం ఉందని అధికారులు తెలిపారు. నకిలీ కంపెనీలు సృష్టించి, చైనా నుంచి భారత్కు, భారత్ నుంచి చైనాకు నిధులు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మోసాలు, ఫోర్జరీకి పాల్పడుతున్నాడన్న అభియోగాలతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2018లో చార్లీని అరెస్టు చేసినట్లు చెప్పారు.