Friday, April 26, 2024
- Advertisement -

ఊహించని స్టెప్.. నేపాల్ లో చైనా బృందం..!

- Advertisement -

నేపాల్​ కమ్యూనిస్టు​ పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ (ప్రచండ)తో.. చైనా రాయబారి హౌ యాంకీ సమావేశమయ్యారు. ఖుమ్లతార్​లోని ప్రచండ నివాసంలో వీరి భేటి జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఇటీవల అధికార ఎన్​సీపీలో చీలిక ఏర్పడటం, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్​ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపాల్​లో చైనా రాయబారి పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే నేపాల్​ అంతర్గత వ్యవహారాల్లో బీజింగ్​ తలదూర్చటం ఇదేమీ కొత్త కాదని అక్కడి విద్యార్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భేటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజింగ్​ రాయబార కార్యాలయం ముందు చైనా వ్యతిరేక నినాదాలు చేశారు.

నేపాల్​ రాష్ట్రపతి విద్యాదేవి భండారీని అధికార నివాసమైన శీతల్​ నివాస్​లో రెండు రోజుల క్రితం చైనా రాయబారి కలిశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గతంలోనూ ఆమె పలువురితో భేటీ అయ్యారు. రోడ్​ అండ్​ బెల్ట్ ఇన్షియేటివ్ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి నేపాల్​తో చైనా సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -